CSK vs pbks | చెన్నై సూపర్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ సునాయసంగా గెలుపొందింది. చెన్నై నిర్దేశించిన 135 పరుగుల లక్ష్యాన్ని కేవలం 13 ఓవర్లలోనే ఛేదించింది. 6 వికెట్ల తేడాతో ధోనీసేనపై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన చెన్నై ఆటగాళ్లు.. ఆరంభం నుంచే తడబడ్డారు. డుప్లెసిస్ ( 76 ) ఒక్కడే రాణించాడు. తొలుత బ్యాటింగ్కు దిగిన గైక్వాడ్ ( 12 ) పరుగులకే క్యాచ్ ఔట్ అవ్వగా.. మొయిన్ డకౌట్ అయ్యాడు. రాబిన్ ఉతప్ప ( 2), అంబటి రాయుడు (4), ధోనీ (12) పరుగులు చేయడంలో విఫలమయ్యారు. జడేజా (15) కూడా ఆకట్టుకోలేకపోయారు. దీంతో నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి చెన్నై 134 పరుగులు మాత్రమే చేయగలిగింది.
చెన్నై నిర్దేశించిన 135 పరుగుల లక్ష్యంతో చేజింగ్ దిగిన పంజాబ్.. ఆది నుంచి దూకుడుగా ఆడింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ ( 98) మెరుపు ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. దీంతో మయాంక్ అగర్వాల్ (12), మార్క్రమ్ (13) ఫర్వాలేదనిపించినప్పటికీ పంజాబ్ సునాయసంగా గెలిచింది. రన్రేట్ను మెరుగు పరుచుకుని పాయింట్ల పట్టికలో ముంబైని వెనక్కి నెట్టింది. ఐదో స్థానానికి ఎగబాకింది.