టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న చెన్నైకి యువ పేసర్ ముకేష్ చౌదరి అదిరిపోయే ఆరంభం ఇచ్చాడు. తొలి బంతికి ఫోర్ కొట్టిన పంజాబ్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (4)ను రెండో బంతికే పెవిలియన్కు పంపాడు. ఆఫ్ వికెట్ ఆవల ముకేష్ వేసిన లెంగ్త్ బాల్ను డ్రైవ్ చేసేందుకు ప్రయత్నించిన మయాంక్.. బంతిని నేలపై ఉంచేలకపోయాడు.
దీంతో గాల్లోకి లేచిన బంతిని కవర్స్లో ఫీల్డింగ్ చేస్తున్న ఊతప్ప చాలా సులభంగా అందుకున్నాడు. దాంతో మయాంక్ చిరాగ్గా మైదానాన్ని వీడాడు. తొలి ఓవర్లోనే వికెట్ తీసిన చెన్నై శిబిరం సంబరాల్లో మునిగిపోయింది. తొలి ఓవర్ ముగిసే సరికి పంజాబ్ జట్టు 8/1 స్కోరుతో నిలిచింది. ఆ తర్వాతి ఓవర్ తొలి బంతికి సిక్సర్ బాదిన రాజపక్స్ (9) కూడా మరుసటి బంతికే రనౌట్గా వెనుతిరిగాడు. దీంతో పంజాబ్ జట్టు 14/2 స్కోరుతో ఆరంభంలోనే ఇబ్బందుల్లో పడింది.