ఐపీఎల్లో కొత్త జట్టు లక్నో సూపర్ జెయింట్స్.. డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్కు దిమ్మతిరిగే షాకిచ్చింది. రాబిన్ ఊతప్ప (50), శివమ్ దూబే (49) దుమ్ముదులపడంతో.. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు 210 పరుగుల భారీ స్కోరు చేసింది. అయితే లక్ష్యఛేదనలో లక్నో జట్టుకు కెప్టెన్ కేఎల్ రాహుల్ (40), క్వింటన్ డీకాక్ (61) అదిరిపోయే ఆరంభం ఇచ్చారు.
ఆ తర్వాత ఎవిన్ లూయిస్ (55 నాటౌట్) దంచికొట్టడంతో లక్నో జట్టు అనూహ్య విజయం సాధించింది. ఈ సమయంలో లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ గౌతమ్ గంభీర్ రియాక్షన్ తెగ వైరల్ అవుతోంది. ఎప్పుడూ ప్రశాంతంగా ఉన్నట్లు కనిపించే గంభీర్..
ఈ మ్యాచ్లో తమ జట్టు అసాధ్యాన్ని సుసాధ్యం చేయడంతో ఆనందం పట్టలేకపోయాడు. పిడికిళ్లు బిగించి గాల్లో పంచులు విసుర్తూ కుర్చీలో నుంచి లేచాడు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.