చెన్నై: చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) ఐపీఎల్ విజయోత్సవ వేడుక ఘనంగా జరిగింది. తమిళనాడు రాజధాని చెన్నైలోని కలైవానర్ అరంగంలో శనివారం ఆడంబరంగా నిర్వహించారు. సీఎం ఎంకే స్టాలిన్, సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోనీ, బీసీసీఐ సెక్రటరీ జే షా, లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఎంకే స్టాలిన్ పేరుతో ఉన్న సీఎస్కే జట్టు టీ షర్ట్ను సీఎం స్టాలిన్, ధోని కలిసి ఆవిష్కరించారు. 2010, 2011, 2018, 2021 ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ గెలిచిన ట్రోఫీలను ఈ సందర్భంగా ప్రదర్శించారు.
కాగా, తాను ఎప్పుడూ తన క్రికెట్ను ప్లాన్ చేసుకుంటానని సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోనీ తెలిపారు. చివరిగా రాంచీలో క్రికెట్ ఆడినట్లు చెప్పారు. ODI వెర్షన్లో చివరి హోమ్ గేమ్ తన స్వస్థలమైన రాంచీలో జరిగిందని గుర్తు చేసుకున్నారు. కాబట్టి, తన చివరి టీ20 మ్యాచ్ చెన్నైలో జరుగుతుందని ఆశిస్తున్నానని ధోని అన్నారు. వచ్చే ఏడాడిలోనా లేదా ఐదేండ్లలోనా అన్నది తెలియదంటూ అందరినీ సస్పెషన్లో ఉంచారు.