బీసీసీఐ అధ్యక్షుడు, భారత జట్టు మాజీ సారధి సౌరవ్ గంగూలీ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడా? త్వరలోనే బీసీసీఐ అధ్యక్ష పదవికి రాజీనాయ చేయబోతున్నాడా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. తాజాగా గంగూలీ చేసిన క్రిప్టిక్ ట్వీట్ వైరల్గా మారింది.
‘‘1992లో క్రికెట్తో నా ప్రయాణం ప్రారంభమై.. 2022 నాటికి 30 ఏళ్లు అవుతోంది. అప్పటి నుంచి క్రికెట్ నాకు ఎంతో ఇచ్చింది. ముఖ్యంగా మీ అందరి మద్దతును అందించింది. ఈ ప్రయాణంలో భాగమైన వాళ్లు, మద్దతుదారులు, నేను ఇక్కడి వరకు రావడంలో సాయపడిన వాళ్లు అందరికీ ధన్యవాదాలు చెప్పాలని అనుకుంటున్నా. ఈరోజు మరింత మందికి సహాయం అందిస్తుందనిపించే ఒక కొత్త నిర్ణయం తీసుకుంటున్నా. జీవితంలో ఈ కొత్త దశలోకి అడుగుపెట్టే సమయంలో మీ మద్దతు కొనసాగుతుందని ఆశిస్తున్నా’’ అని గంగూలీ ట్వీట్ చేశాడు.
దాంతో ఆయన రాజకీయాల్లో చేరతారనే వార్తలు గుప్పుమన్నాయి. ఇటీవలి కాలంలో కేంద్ర హోంమంత్రి, బీజేపీ కీలక నేత అమిత్షాతో గంగూలీ రెండుసార్లు భేటీ అవడం కూడా ఈ వదంతులకు కారణం అవుతోంది. దాదా త్వరలోనే కాషాయ కండువా కప్పుకుంటారని, బీజేపీ తరఫున పోటీ చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. గంగూలీ తీసుకున్న నిర్ణయం ఏంటో తెలయాలంటే మాత్రం వెయిట్ చేయాల్సిందే.
— Sourav Ganguly (@SGanguly99) June 1, 2022