Cristiano Ronaldo : ఫుట్బాల్ లెజెండ్ క్రిస్టియానో రొనాల్డో(Cristiano Ronaldo) కెరీర్లో మరో మైలురాయిని అధిగమించాడు. ఈ ఫార్వర్డ్ ప్లేయర్ ప్రొఫెషనల్ ఫుట్బాల్లో 1,200వ మ్యాచ్ ఆడాడు. ఆల్ నస్రీ(Al Nassri) క్లబ్ తరఫున ఆడుతున్న రొనాల్డో.. సౌదీ ప్రో లీగ్(Soudi Pro League)లో భాగంగా శుక్రవారం అల్ రియాద్(Al Riyadh)తో జరిగిన మ్యాచ్తో ఈ ఫీట్ సాధించాడు. తద్వారా అత్యధిక మ్యాచ్లు ఆడిన రెండో ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఇంగ్లండ్ ఆటగాడు పీటర్ షిల్టన్(Peter Shilton) 1,390 మ్యాచ్లతో ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
కెరీర్లో గుర్తుండిపోయే ఈ మ్యాచ్లో రొనాల్డో ఒక గోల్ చేయడమే కాకుండా మరొక గోల్కు సహాయం అందించాడు. దాంతో, అల్ నస్రీ జట్టు 4-1తో రియాద్పై గెలుపొందింది. మ్యాచ్ అనంతంరం.. అల్ నస్రీ జట్టు సభ్యులకు సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపాడు. ‘నేను 1,200వ మ్యాచ్ ఆడేందుకు సహకరించిన జట్టు సభ్యులకు ధన్యవాదాలు. ఈ ప్రయాణం నిజంగా గొప్పది. అయితే.. ఇప్పటికీ మన జర్నీ ముగియలేదు’ అని ఇన్స్టాగ్రామ్లో రాసుకొచ్చాడు.
క్రిస్టియానో రొనాల్డో
నిరుడు ఖతార్లో వరల్డ్ కప్ సమయంలో రొనాల్డో ఒక ఇంటర్వ్యూలో.. మాంచెస్టర్ యూనైటెడ్ (Manchester United) యజామాన్యంపై తీవ్ర విమర్శలు గుప్పించాడు. అతడి వ్యాఖ్యల్ని సీరియస్గా తీసుకున్న అతడి కాంట్రాక్టు రద్దు చేసింది. దాంతో, రొనాల్డోను దక్కించుకునేందులు పీఎస్జీ(PSG)తో సహా పలు క్లబ్స్ పోటీపడ్డాయి. చివరకు అల్ నస్రీ క్లబ్ రూ.4,400 కోట్ల భారీ ధరకు రొనాల్డోతో ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే.