డెహ్రాడూన్: క్రికెటర్ రిషబ్ పంత్కు రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే. డ్యాషింగ్ బ్యాటర్ పంత్ .. దాదాపు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఉత్తరాఖండ్లోని రూర్కీ వద్ద పంత్ ప్రయాణిస్తున్న కారు డివైడర్ను ఢీకొట్టింది. ఈ ఘటన శుక్రవారం తెల్లవారుజామున జరిగింది.
ప్రమాదం సమయంలో రిషబ్ మెర్సిడీజ్ కారులో ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రమాదం తర్వాత కారులో మంటలు చెలరేగాయి. ఆ సమయంలో పంత్ చాలా డేరింగ్ స్టంట్ చేశాడు. మండుతున్న కారు నుంచి .. ఆ కారు అద్దాల్ని పగులగొట్టి .. బయటకు దూకినట్లు పోలీసులు తమ రిపోర్ట్లో తెలిపారు.
పంత్కు స్వల్పంగా కాలిన గాయాలయ్యాయి. అతని పరిస్థితి ప్రస్తుతం సీరియస్గా ఏమీలేదని అన్నారు. రాత్రి ప్రయాణం వల్ల .. ఓ దశలో కాస్త నిద్ర మత్తు వచ్చినట్లు అయ్యిందని, దాని వల్ల ప్రమాదం జరిగినట్లు ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్ కుమార్ తెలిపారు.
ప్రమాదం జరిగిన సమయంలో.. రిషబ్ పంత్ ఒక్కడే కారులో ఉన్నాడు. ప్రస్తుతం అతను డెహ్రాడూన్లోని మ్యాక్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు.