న్యూఢిల్లీ: క్రికెట్(Cricket) అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ. 2028లో లాస్ ఏంజిల్స్లో జరగనున్న ఒలింపిక్ క్రీడల్లో క్రికెట్ ఆడేందుకు అనుమతి ఇచ్చారు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ప్రతిధిని క్రికెట్కు ఆమోదం తెలిపినట్లు శుక్రవారం ప్రకటన చేశారు. ముంబైలో జరిగిన ఐఓసీ ఎగ్జిక్యూటీ బోర్డు మీటింగ్లో పాల్గొన్న అధ్యక్షుడు థామస్ బాచ్ ఈ విషయాన్ని తెలిపారు. ఒలింపిక్స్లో కొత్తగా అయిదు క్రీడలను చేర్చాలనుకున్నారని, దాంట్లో క్రికెట్ కూడా ఉందని, ఆ ప్రతిపాదనకు లాస్ ఏంజిల్స్ నిర్వాహకులు ఆమోదించినట్లు థామస్ బాచ్ పేర్కొన్నారు. బేస్బాల్, సాఫ్ట్బాల్, ఫ్లాగ్ ఫుట్బాల్, స్క్వాష్, లాక్రోసీ క్రీడలను ఒలింపిక్స్లో ఆడించే ఛాన్సు ఉంది.
We will work with the ICC. We will not be working with individual cricket authorities of any nation. With cooperation from ICC, we will see how can Cricket be made more popular: IOC President Thomas Bach pic.twitter.com/rFEuiOn7YC
— ANI (@ANI) October 13, 2023
దాదాపు 128 ఏళ్ల తర్వాత మళ్లీ ఒలింపిక్స్లో క్రికెట్ ఆటను చేర్చారు. చివరిసారి 1900 సంవత్సరంలో పారిస్లో జరిగిన ఒలింపిక్ క్రీడల్లో క్రికెట్ ఆడించారు. ఆ ఏడాది ఫైనల్లో ఫ్రాన్స్పై బ్రిటన్ గెలిచింది. ఆ రోజుల్లో ప్రతి జట్టులో 12 మంది ఆటగాళ్లు ఉండేవారు. రెండు రోజుల పాటు మ్యాచ్లు జరిగేవి. అయితే లాస్ ఏంజిల్స్లో క్రికెట్ ఆడించే అంశంపై అధికారికంగా తుది ప్రకటన సోమవారం వెలుబడే ఛాన్సు ఉంది.