లండన్: ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవ్ స్మిత్(Steve Smith) రనౌట్పై వివాదం చెలరేగుతోంది. ఆ బ్యాటర్ అవుటైన తీరుపై సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. రెండో టెస్టు రెండో రోజు బ్యాటింగ్ సమయంలో.. స్టీవ్ స్మిత్ 78వ ఓవర్లో రనౌట్ అయ్యాడు. క్రిస్ వోక్స్ వేసిన బౌలింగ్లో అతను రెండు రన్స్ తీశాడు. అయితే ఫీల్డర్ జార్జ్ ఎల్హమ్ వేసిన త్రోను అందుకున్న కీపర్ జానీ బెయిర్స్టో వికెట్లను పడగొట్టేశాడు. అయితే క్రీజ్ లైన్కు సమీపంలో స్మిత్ బ్యాట్ ఉండడంతో.. రనౌట్ నిర్ణయాన్ని థార్డ్ అంపైర్కు రెఫర్ చేశారు. పలుమార్లు రిప్లేలను పరిశీలించిన టీవీ అంపైర్ నితిన్ మీనన్.. నాటౌట్గా ప్రకటించాడు. నిజానికి ఆ సమయంలో స్మిత్ ఔటైనట్లు ఇంగ్లండ్ ప్లేయర్లు సెలబ్రేట్ చేసుకున్నారు. కానీ టీవీ అంపైర్ నిర్ణయం ఇంగ్లండ్ ఆటగాళ్లలో నిరాశను నింపింది.
We have received a few questions regarding the decision in the below video.
Law 29.1 states: "The wicket is broken when at least one bail is completely removed from the top of the stumps, or one or more stumps is removed from the ground." (1/2)#Ashes pic.twitter.com/RyZMgf5ItF
— Marylebone Cricket Club (@MCCOfficial) July 28, 2023
ఈ రనౌట్ గురించి మెరిల్బోన్ క్రికెట్ క్లబ్ క్లారిటీ ఇచ్చింది. ట్విట్టర్లో ఆ రనౌట్ గురించి వివరించింది. టీవీ అంపైర్ మీనన్ నిర్ణయాన్ని సమర్ధిస్తూ ఎంసీసీ ట్వీట్ చేసింది. బాల్ అందుకోవడానికి ముందే బెయిర్స్టో వికెట్లను పడేసినట్లు టీవీ రిప్లేల ద్వారా అంపైర్ మీనన్ గుర్తించాడు. దీంతో స్టీవ్ స్మిత్ను నాటౌట్గా ప్రకటించాడు. ఇంగ్లండ్ తన తొలి ఇన్నింగ్స్లో 295 రన్స్కు ఆలౌట్ అయ్యింది. స్మిత్ 71 రన్స్ చేశాడు.