హైదరాబాద్/సిటీబ్యూరో, (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ సైక్లింగ్ గ్రూప్ (హెచ్సీజీ) సభ్యులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు అభినందించారు. త్వరలో వారిని కలవనున్నట్టు బుధవారం ఎక్స్లో తెలిపారు. హెచ్సీజీ సభ్యులు మూడో ఎడిషన్ సందర్భంగా కార్గిల్ నుంచి కన్యాకుమారి వరకు సైక్లింగ్ యాత్రను విజయవంతంగా పూర్తి చేశారు.
సైక్లింగ్ వినియోగం పెంచాల్సిన బాధ్యతపై అందరికి అవగాహన కల్పించారు. దేశంలోనే తొలిసారిగా హెచ్సీజీ సభ్యులు మూడోసారి ఇలాంటి యాత్రను నిర్వహించామని ఎక్స్లో తెలిపారు. తమకు కలిసే అవకాశం కల్పించాల్సిందిగా కేటీఆర్ను వారు కోరగా అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. త్వరలో కలుద్దామంటూ కేటీఆర్ వారికి తెలిపారు.