Commonwealth Games | బర్మింగ్హోమ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్లో భారత్ అదరగొడుతోంది. పలు విభాగాల్లో క్రీడాకారులు సత్తాచాటి పతకాలు సాధించారు. క్రీడల్లో ఐదు రోజు భారత్ ఖాతాలో రెండు స్వర్ణ పతకాలు చేరాయి. భారత పురుషుల టేబుల్ టెన్నిస్ జట్టు బంగారు పతకాన్ని సాధించి.. చరిత్ర సృష్టించింది. ఫైనల్లో సింగపూర్పై భారత జట్టు 3-1 తేడాతో విజయాన్ని సాధించింది. భారత జోడీ సత్యన్, శరత్ కమల్, హర్మీత్ అద్భుత ప్రదర్శనతో పతకాన్ని సాధించారు. కామన్వెల్త్ గేమ్స్ 2022లో టేబుల్ టెన్నిస్లో భారత్కు ఇదే తొలి పతకం.
దీంతో భారత్ ఖాతాలో ఐదో బంగారు పతకం చేరగా.. ఇప్పటి వరకు సాధించిన పతకాల సంఖ్య మొత్తం 11కు చేరింది. ఇందులో ఐదు బంగారు, మూడు సిల్వర్, మరో మూడు కాంస్య పతకాలున్నాయి. కామన్వెల్త్ గేమ్స్లో ఐదో రోజు మంగళవారం లాన్ బౌల్స్లో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. కామన్వెల్త్ గేమ్స్లో తొలిసారి గోల్డ్ మెడల్ను కైవసం చేసుకున్నది. ఫైనల్లో దక్షిణాఫ్రికాపై 17-10 తేడాతో భారత్ గెలుపొందింది. వెయిట్ లిఫ్టింగ్ పురుషుల 96 కేజీల విభాగంలో వికాస్ ఠాకుర్ సిల్వర్ మెడల్ను సాధించాడు. 346 కిలోల బరువును ఎత్తి.. రెండో స్థానంలో నిలిచి, పతకాన్ని కైవసం చేసుకున్నాడు.