హైదరాబాద్ : ఇండియన్ క్రికెటర్ మహ్మద్ సిరాజ్ను(Cricketer Mohammed Siraj) సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అభినందించారు. టీ-20 వరల్డ్ కప్(T-20 World Cup) గెలుచుకున్న అనంతరం హైదరాబా ద్కు చేరుకున్న సిరాజ్ మంగళవారం ఉదయం ముఖ్యమంత్రిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సిరాజ్ను ఘనంగా సన్మానించారు. మహ్మద్ సిరాజ్ అంతర్జాతీయ క్రికెట్లో తన అద్భుతమైన ప్రతిభను చూపుతున్నాడు.
అందుకే ఈ రోజు అత్యున్నత స్థాయి క్రికెటర్లలో ఒకడుగా పేరు సంపాదించుకున్నారని ముఖ్యమంత్రి ప్రశంసించారు. సిరాజ్కు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉద్యోగం, ఇంటి స్థలం కేటాయించాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లో లేదా చుట్టుపక్కల ప్రాంతాల్లో అందుకు అనువైన స్థలాన్ని వెంటనే గుర్తిం చాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగం కల్పించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.