Ravi on Kohli | పాకిస్తాన్తో మ్యాచ్ సందర్భంగా కోహ్లీ కింగ్ ఇన్నింగ్స్ ఆడారని టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి కితాబునిచ్చారు. గత కొంతకాలంగా కోహ్లీని టార్గెట్ చేసిన మీడియా, క్రిటిక్స్కు సరైన సమాధానం ఇచ్చారని భావిస్తున్నారు. ఒకే ఒక్క ఆటతో అందరి నోర్లు మూయించాడని రవిశాస్త్రి చెప్పారు.
విరాట్ కోహ్లీతో సుదీర్ఘకాలం సన్నిహితంగా గడిపిన టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రికి.. మాస్టర్ బ్యాట్స్మెన్ మనస్సు గురించి తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కోహ్లీ పడిపోయిన సమయంలో మద్దతుగా నిలిచారు. విశ్రాంతి తీసుకోమని సలహా ఇచ్చిన వారిలో రవి ముందు వరసలో ఉన్నారు. పాక్తో ఆడిన మ్యాచ్లో అతడు కొట్టిన రెండు షాట్లు ఐకానిక్ అటూ రవిశాస్త్రి భావోద్వేగానికి గురయ్యారు.
‘నేను ఏమాత్రం ఆశ్చర్యపోలేదు. ఇలాంటిది జరుగుతుందని కొంతకాలంగా ఎదురు చూస్తున్నాను. ఇది ఆస్ట్రేలియాలోనే జరుగుతుందని నాకు తెలుసు. ఇక్కడి పిచ్లు అతనికి ఎంతో సరిపోతాయి. అతను ఈ మైదానాల్లో ఇక్కడి అభిమానుల ఎదుట ఆడేందుకు ఎంతగానో ఇష్టపడతాడు. పాకిస్తాన్పై అతని రికార్డు ఎల్లప్పుడూ మంచిగానే ఉంటుంది’ అని రవిశాస్త్రి పేర్కొన్నారు. గత కొంతకాలంగా అతడ్ని దగ్గరగా గమనించిన తాను.. అతడు ఏమి అనుభవించాడో చూశానని, ఎలా మీడియా, క్రిటిక్స్ ఆయన మీదపడి దాడి చేశాయో కూడా చూశానన్నారు. ఇప్పుడు ఒక్క ఆటతోనే వారందరికీ సమాధానం చెప్పాడని అన్నారు.