Virat Kohli | టీం ఇండియా టీ-20 జట్టు సారధిగా విరాట్ కోహ్లీ వైదొలిగే విషయమై బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ క్లారిటీ ఇచ్చారు. టీ-20 వరల్డ్ కప్ టోర్నీ ప్రారంభం కావడానికి ముందు జరిగిన ఓ సమావేశంలో బీసీసీఐలోని ప్రతి ఒక్కరూ.. ఇప్పటికిప్పుడు టీ-20 ఫార్మాట్ సారధిగా వైదొలగవద్దని కోరారని శుక్రవారం చెప్పాడు. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్కు జట్టు ప్రకటన సందర్భంగా చేతన్ శర్మ ఈ సంగతి చెప్పారు. టీ-20 ఫార్మాట్ సారధిగా వైదొలిగే విషయం పునరాలోచించుకోవాలని ప్రతి ఒక్కరూ కోరారన్నాడు చేతన్శర్మ.
టీ-20 ఫార్మాట్ సారధిగా తప్పుకునే విషయం ముందే ప్రకటిస్తే టీం ఆట తీరుపై ప్రభావం పడుతుందని సెలెక్టర్లంతా చెప్పాం.. భారత్ క్రికెట్ కొనసాగాలని సూచించాం.. అని చేతన్ శర్మ తెలిపాడు. కానీ విరాట్ కోహ్లీ తన వైఖరికే కట్టుబడి ఉన్నాడని చెప్పారు. ఇక విరాట్, రోహిత్ మధ్య దూరం పెరిగిందనే వార్తలను చేతన్ శర్మ కొట్టిపడేశారు. ఈ ఊహాగానాలను చూస్తే నవ్వు వస్తుందన్నారు.