న్యూఢిల్లీ: శ్రీలంక సిరీస్ కోసం భారత జట్టులో మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే జనవరి 3 నుంచి లంకతో టీ20, వన్డే సిరీస్ కోసం చేతన్ శర్మ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ రెండు వేర్వేరు జట్లను ఎంపిక చేయనుంది.
ఫామ్లేమితో సతమతమవుతున్న వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్పై వేటుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు గాయం నుంచి పూర్తిగా కోలుకోని రోహిత్శర్మ టీ20 సిరీస్కు దూరం కానుండగా, కోహ్లీకి విశ్రాంతి ఇవ్వనున్నారు.