హైదరాబాద్: దేశవ్యాప్త పర్యటనలో భాగంగా ప్రతిష్ఠాత్మక చెస్ ఒలింపియాడ్ టోర్నీ టార్చ్ శనివారం హైదరాబాద్కు చేరుకుంది. చత్తీస్గఢ్ నుంచి ఇక్కడికి వచ్చిన టార్చ్ రిలేకు నగరంలో ఘన స్వాగతం లభించింది. స్థానిక గచ్చిబౌలి స్టేడియం వేదికగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భారత యువ గ్రాండ్మాస్టర్ ఇరిగేసి అర్జున్ చేతుల మీదుగా టార్చ్ అందుకున్న క్రీడా మంత్రి శ్రీనివాస్గౌడ్… ద్రోణవల్లి హారికకు అందజేశారు. చెన్నై వేదికగా ఈ నెల 28 నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు జరిగే టోర్నీలో భారత్ విజయం సాధించాలని మంత్రి ఆకాంక్షించారు. టార్చ్ రిలే కార్యక్రమంలో సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి, యువ గ్రాండ్మాస్టర్లు రాజా రిత్విక్, రాహుల్ శ్రీవాత్సవ్ తదితరులు పాల్గొన్నారు.