IPL 2024 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదిహేడో సీజన్ మరికొన్ని గంటల్లో షురూ కానుంది. ఆరంభ పోరు కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్న అభిమానుల ఆశలపై చెపాక్ స్టేడియం(Chepauk Stadium) నిర్వాహకులు నీళ్లు చల్లారు. స్టేడియంలో మ్యాచ్ చూసేందుకు సిద్దమవుతున్న ఫ్యాన్స్పై భారీ ఆంక్షలు విధించారు. కారు పార్కింగ్కు స్థలం లేదని తేల్చి చెప్పడమే కాకుండా.. స్టేడియానికి వచ్చేందుకు ప్రజా రవాణాను ఆశ్రయించాలని సూచించారు.
బస్సులు లేదంటే బైక్లపై స్టేడియానికి చేరుకోవాలని ఆర్సీబీ, సీఎస్కే అభిమానులను కోరారు. అంతేకాదు హెడ్ఫోన్స్, బ్యాక్ప్యాక్స్తో పాటు బాటిళ్లు వంటి పలు వస్తువులకు అనుమతి లేదని స్పష్టం చేశారు. నిషేధిత వస్తువుల జాబితాలో ఏమేం ఉన్నాయంటే..?
హెల్మెట్, ఆల్కహాల్, క్యాన్లు, పవర్ బ్యాంక్స్, బాటిళ్లు, టిఫిన్లు, గొడుగులు, కుర్చీలు, స్టూళ్లు, పటాకులు, పర్ఫ్యూమ్, బెలూన్స్, పెన్నులు, పెన్సిళ్లు, స్టేట్ బోర్డు, రేడియో, బ్యాక్ప్యాక్స్, హెడ్ఫోన్స్, ల్యాప్టాప్, పెంపుడు జంతువులు, సిరంజీలు, పదునైన వస్తువులు. ఎట్టి పరిస్థితుల్లోనూ స్టేడియంలోకి వీటిని అనుతించమని చెపాక్ స్టేడియం ప్రకటన విడుదల చేసింది. అసలే నీటి కరువుతో అల్లాడుతున్న అభిమానులు ఐపీఎల్తో రిలాక్స్ అవుదామనుకున్నారు. కానీ, చెపాక్ స్టేడియం నిర్వాహకులు పలు వస్తువులపై నిషేధం విధించడంతో వాళ్ల ఆశలపై నీళ్లు చల్లినట్టు అయింది.
ఐపీఎల్ ఆరంభ పోరులో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు టోర్నీ అమీతుమీ తేల్చుకోనున్నాయి. చెపాక్ స్టేడియంలో రాత్రి 800 గంటలకు మ్యాజ్ జరుగనుంది. రుతురాజ్ గైక్వాడ్ సారథిగా తొలి మ్యాచ్ ఆడనుండగా.. విజయంతో టోర్నీని ఆరంభించాలని ఆర్సీబీ భావిస్తోంది.