అమరావతి : విశాఖ పోర్టులో భారీ ఎత్తున లభ్యమైన డ్రగ్స్ వెనుకాల వైసీపీ పెద్దల హస్తం ఉందని టీడీపీ చేస్తున్న ఆరోపణలపై వైసీపీ నాయకులు (YCP Leaders) శుక్రవారం ఏపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సీఈవో ముఖేష్కుమార్మీనాను వైసీపీ నాయకులు పేర్నినాని(Perni Nani) , లేళ్ల అప్పిరెడ్డి, మల్లాది విష్ణు తదితరులు కలిసి వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా పేర్నినాని మీడియాతో మాట్లాడుతూ ఎలాంటి ఆదారాలు లేకుండా తప్పుడు ఆరోపణలు చేసే వారిపై ఎన్నికల నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని కోరినట్లు వెల్లడించారు. ఎన్నికల్లో వైసీపీని దెబ్బతీసేలా టీడీపీ వ్యవహరిస్తుందని మండిపడ్డారు. చంద్రబాబు, లోకేశ్కు విదేశాల్లో ఉన్న కొందరితో సత్సంబంధాలు ఉన్నాయని వారే అక్కడి నుంచి డ్రగ్స్ తెప్పించారని ఫిర్యాదు చేశారు.
డ్రగ్స్ స్వాధీనంపై లోతుగా విచారణ జరపాలని కోరారు. రాజకీయాల కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారిపోతాడని విమర్శించారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి చెక్కుల పంపిణీ చేసి ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారని ఆరోపించారు.