IPL 2024 | ఐపీఎల్ (IPL 2024) మ్యాచ్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) జట్టు హైదరాబాద్కు చేరుకుంది. శుక్రవారం ఉప్పల్ స్టేడియంలో సీఎస్కే జట్టు సన్రైజర్స్ (Sunrisers Hyderabad)తో తలపడనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ కోసం చెన్నై జట్టు విశాఖపట్నం నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకుంది.
ఈ క్రమంలో అభిమానులు పెద్ద సంఖ్యలో విమానాశ్రయంకు చేరుకుని చెన్నై జట్టుకు, ధోనికి ఘన స్వాగతం పలికారు. ధోనీ ధోనీ అంటూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఆటగాళ్లు ఎయిర్పోర్ట్ను వీడేంత వరకూ హంగామా చేశారు. మరోవైపు చెన్నై జట్టు ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక వాహనాల్లో భారీ బందోబస్తు నడుమ వారు బస చేసే హోటల్కు చేరుకుంది.
#WATCH | Chennai Super Kings team arrives in Hyderabad, ahead of their clash with Sunrisers Hyderabad in IPL 2024 pic.twitter.com/ljkYpEMFfg
— ANI (@ANI) April 2, 2024
Also Read..
Maneka Gandhi | కుమారుడికి బీజేపీ టికెట్ ఇవ్వకపోవడంపై స్పందించిన మేనకా గాంధీ
Arvind Kejriwal | కేజ్రీవాల్ అభ్యర్థనలకు కోర్టు ఆమోదం.. ఏవేవి అనుమతించిందంటే..?
fire breaks | కెమికల్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం