ICC Champions Trophy: భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ తుది అంకానికి చేరింది. అక్టోబర్ 05న అహ్మదాబాద్ వేదికగా మొదలైన ఈ మెగా టోర్నీలో ఆదివారం (అక్టోబర్ 12) నాటికి గ్రూప్ స్టేజ్ ముగిసింది. అయితే వరల్డ్ కప్ – 2023 పాయింట్ల పట్టికలో టాప్ -8 జట్లు 2025లో పాకిస్తాన్ వేదికగా జరగాల్సి ఉన్న ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధిస్తాయని ఐసీసీ ఇదివరకే ప్రకటించింది. ఈ ప్రపంచకప్లో గ్రూప్ స్టేజ్ ముగియడంతో ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడబోయే జట్లేవో క్లారిటీ వచ్చింది.
పది జట్లు ఆడిన ప్రపంచకప్లో ఇండియా, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లు సెమీస్ చేరాయి. వీటితో పాటు పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉన్న పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్ కూడా అర్హత సాధించాయి. శ్రీలంక, నెదర్లాండ్స్లు ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించడంలో విఫలమయ్యాయి.
2025లో జరుగబోయే ఛాంపియన్స్ ట్రోఫీని వన్డే ఫార్మాట్లో ఆడిస్తారా..? లేక టీ20కి మారుస్తారా..? అన్నదానిపై ఇంకా క్లారిటీ లేదు. దీనిపై ఐసీసీ.. క్రికెట్ బోర్డులతో చర్చలు జరుపుతోంది. వన్డే ప్రపంచకప్కు భారత్లో వస్తున్న ఆదరణ చూసి ఛాంపియన్స్ ట్రోఫీని ఇదే ఫార్మాట్లో కొనసాగించాలని డిమాండ్లు వినిపిస్తున్నప్పటికీ బ్రాడ్కాస్టర్లు మాత్రం దీనిని పొట్టి ఫార్మాట్కు మార్చాలని ఐసీసీపై ఒత్తిడి తీసుకొస్తున్నట్టు సమాచారం. దీనిపై ప్రపంచకప్ ముగిసిన తర్వాత ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.