చండీగఢ్: భారత శతాధిక స్ప్రింటర్ మన్ కౌర్ ఈ లోకాన్ని వీడింది. గుండెపోటుతో శనివారం తన తల్లి తుదిశ్వాస విడిచినట్లు కౌర్ కొడుకు గుర్దేవ్సింగ్ పేర్కొన్నాడు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న 105 ఏండ్ల కౌర్ మమ్మల్ని విడిచి వెళ్లిందని అన్నాడు. 1916 మార్చి 1న జన్మించిన కౌర్ ‘మిరాకిల్ మామ్ ఫ్రమ్ చండీగఢ్’గా పేరు తెచ్చుకుంది. 93 ఏండ్ల వయసులో పరుగు పందాన్ని కెరీర్గా ఎంచుకున్న మన్ కౌర్ 2007లో చండీగఢ్ మాస్టర్స్ అథ్లెటిక్స్ మీట్లో తొలి పతకాన్ని కైవసం చేసుకుంది.