Champions Trophy | ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆతిథ్య పాకిస్థాన్, న్యూజిలాండ్ మధ్య కరాచీ వేదికగా తొలి మ్యాచ్ జరుగుతున్నది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ భారీ స్కోరు సాధించింది. పాకిస్థాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ప్రారంభంలోనే న్యూజిలాండ్కు ఎదురుదెబ్బలు తగిలాయి. డేవాన్ కాన్వే (10), కేన్ విలియమ్సన్ (1), డారిల్ మిచేల్ (10) తక్కువ స్కోరుకే పెవిలియన్కు చేరారు. ఒక దశలోనే 73 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ కివి జట్టును ఓపెనర్ విల్ యంగ్, టామ్ లాథమ్ ఆదుకున్నారు. ఇద్దరు సెంచరీలతో కదం తొక్కారు. దాంతో న్యూజిలాండ్ జట్టు భారీ స్కోరు సాధించగలిగింది. విల్ యంగ్ 113 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్సర్ సహాయంతో 107 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత టామ్ లాథమ్, గ్లెన్ ఫిలిప్ స్కోరును పరుగెత్తించారు. ఈ క్రమంలోనే లాథమ్ సైతం సెంచరీ చేయగా.. ఫిలిఫ్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దాంతో న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 320 పరుగులు భారీ స్కోరును సాధించింది.
న్యూజిలాండ్ ఓపెనర్ విల్ యంగ్ 107 బంతుల్లో సెంచరీ చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో తొలి మ్యాచ్లోనే సెంచరీతో అలరించాడు. మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న న్యూజిలాండ్ను యంగ్ రక్షించాడు. టామ్ లాథమ్తో కలిసి నాలుగో వికెట్కు సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. పాక్ ఫాస్ట్ బౌలర్ నసీమ్ షా.. యంగ్ను అవుట్ ఆ జట్టుకు ఉపశమనం కల్పించారు. యంగ్ -టామ్ లాథమ్ నాల్గవ వికెట్కు సెంచరీ భాగస్వామ్యాన్ని బ్రేక్ చేశాడు. యంగ్ 113 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్సర్ సహాయంతో 107 పరుగులు చేసిన తర్వాత ఔటయ్యాడు. యంగ్-లాథమ్ జోడీ నాలుగో వికెట్కు 118 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత లాథమ్-ఫిలిప్ జోడీ సైతం ఐదో వికెట్కు సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. లాథమ్ 103 బంతుల్లో పది ఫోర్లు, మూడు సిక్సర్ల సహాయంతో 104 పరుగులు చేసి 118 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ఫిలిఫ్ 39 బంతుల్లో మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సహాయంతో 61 పరుగులు చేశాడు. పాక్ బౌలర్లలో నసీమ్ షా, హరీస్ రవుఫ్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. అబ్రార్ అహ్మద్కు ఒక వికెట్ దక్కింది.
న్యూజిలాండ్ తరఫున చాంపియన్స్ ట్రోఫీలో సెంచరీ చేసిన నలుగురు బ్యాట్స్మెన్లలో యంగ్ చోటు సంపాదించాడు. గతంలో నాథన్ ఆష్లే, క్రిస్ కైర్న్స్, కేన్ విలియమ్సన్ కివీస్ జట్టు తరపున ఈ ఘనత సాధించారు. 2004లో అమెరికాపై ఆష్లే అజేయంగా 145 పరుగులు చేయగా.. 2000లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ చివరి మ్యాచ్లో క్రేన్స్ భారత్పై అజేయంగా 102 పరుగులు చేశాడు. 2017లో ఆస్ట్రేలియాపై కేన్ విలియమ్సన్ సెంచరీ సాధించాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్పై సెంచరీ చేసిన ప్రపంచంలో రెండో బ్యాట్స్మన్, న్యూజిలాండ్ తొలి బ్యాట్స్మన్గా యంగ్ నిలిచాడు. ఇంతకు ముందు శ్రీలంక మాజీ బ్యాట్స్మన్ సనత్ జయసూర్య ఐసీసీ ఈవెంట్లో పాక్పై సెంచరీ చేశాడు. 2002లో కొలంబోలో జరిగిన మ్యాచ్లో జయసూర్య అజేయంగా 102 పరుగులు చేశాడు.