అమెరికాలో జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో ఒలింపిక్ చాంపియన్, భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా రజత పకతం సాధించాడు. జావెలిన్ త్రో ఫైనల్లో రెండో స్థానంలో నిలిచాడు. ప్రపంచ అథ్లెటిక్స్లో రజతం సాధించిన తొలి భారత ఫురుష క్రీడాకారుడిగా చోప్రా రికార్డు సృష్టించాడు. 88.13 మీటర్ల దూరం బల్లెం విసిరి ఈ ఘనత సాధించాడు. కాగా, నీరజ్ చోప్రా విజయంపై హర్యానా రాష్ట్రంలోని ఆయన స్వగ్రామం పానిపట్లో ఆదివారం సంబురాలు మిన్నంటాయి.
నీరజ్ చోప్రా కుటుంబ సభ్యులు సంబురాలు జరుపుకునే వీడియో ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది. వారింటికి వచ్చిన అతిథులకు కుటుంబ సభ్యులు లడ్డూలు పంచిపెట్టారు. ఆ గ్రామ మహిళలు నీరజ్ చోప్రా ఇంటి ఆవరణలో నృత్యాలు చేశారు. ఆనందంగా గడిపారు.
అలాగే, నీరజ్ చోప్రాకు ప్రముఖులనుంచి అభినందనలు వెల్లువెత్తాయి. హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్, డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా, మాజీ సీఎం భూపిందర్ సింగ్ హుడా అభినందించారు. అంజు బాబీ జార్జ్, వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, ఒలింపిక్స్ పతక విజేత అభినవ్ బింద్రా, పీఆర్ శ్రీజేష్తో సహా పలువురు క్రీడాకారులు భారత స్టార్ ప్లేయర్పై ప్రశంసలు కురిపించారు.
#WATCH Family and friends celebrate Neeraj Chopra’s silver medal win in the World Athletics Championships at his hometown in Panipat, #Haryana
Neeraj Chopra secured 2nd position with his 4th throw of 88.13 meters in the men’s Javelin finals. pic.twitter.com/khrUhmDgHG
— ANI (@ANI) July 24, 2022