ముంబై: స్వదేశం వేదికగా అక్టోబర్ 5 నుంచి మొదలవుతున్న ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్ కోసం క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్కు ఆహ్వానం లభించింది. దేశ క్రికెట్కు చేసిన సేవలకు గుర్తింపుగా సచిన్ను ప్రత్యేక అతిథిగా ఆహ్వానిస్తూ బీసీసీఐ కార్యదర్శి జై షా శుక్రవారం గోల్డెన్ టికెట్ అందజేశాడు.
‘గోల్డెన్ టికెట్ ఫర్ ఇండియా ఐకాన్స్ కార్యక్రమంలో భాగంగా సచిన్కు టిక్కెట్ అందజేశాను. దేశ క్రికెట్కు అతనో చుక్కానీ. అద్భుత ప్రతిభ ద్వారా సచిన్ భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలిచాడు’ అని షా ట్వీట్ చేశాడు. బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్కు తొలి గోల్డెన్ టికెట్ లభించింది.