బ్రిస్టల్: టాపార్డర్ వైఫల్యం కారణంగా ఇంగ్లండ్తో జరిగిన మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భారత మహిళల జట్టు పరాజయం పాలైంది. గురువారం అర్ధరాత్రి దాటాక జరిగిన మూడో టీ20లో మన అమ్మాయిలు 7 వికెట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. దీంతో ఇంగ్లిష్ జట్టు 2-1తో సిరీస్ కైవసం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. రిచా ఘోష్ (33) టాప్ స్కోరర్ కాగా.. షఫాలీ వర్మ (5), స్మృతి మందన (9), సబ్బినేని మేఘన (0), హర్మన్ప్రీత్ కౌర్ (5), హేమలత (0), స్నేహ్ రాణా (8) విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఎకిల్స్టోన్ మూడు వికెట్లు పడగొట్టింది. అనంతరం లక్ష్యఛేదనలో ఇంగ్లిష్ టీమ్ 18.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసింది. సోఫియా డివైన్ (49), కాప్సీ (38 నాటౌట్) రాణించారు. ఎకిల్స్టోన్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య పొట్టి సిరీస్ ముగియగా.. శనివారం నుంచి మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది.