మెల్బోర్న్: ద్వీపకల్ప దేశం శ్రీలంకలో ప్రస్తుత ఆందోళనకర పరిస్థితుల్లో ఆస్ట్రేలియాతో జరుగాల్సిన సిరీస్పై సందిగ్ధత ఏర్పడింది. లంకలో తీవ్ర అలజడి కొనసాగుతుండడంతో ఈ పర్యటనపై పునరాలోచించుకోవాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం జట్టుకు సూచనలు చేసింది. దీంతో ఈ సిరీస్ జరుగుతుందా లేదా అనేది సందేహాస్పదంగా ఉంది. ఇదిలా ఉంటే ‘షెడ్యూల్లో ఎలాంటి మార్పులు లేవు’ అని లంక క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నా.. ‘అక్కడి పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నాం’ అని ఆసీస్ బోర్డు ప్రతినిధులు చెబుతున్నారు. జూన్, జూలైలో మూడు టీ20 మ్యాచ్లు, ఐదు వన్డేలు, రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్లు జరుగాల్సి ఉంది. లంకలో ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మరికొద్ది రోజుల్లో ఆసీస్ సిరీస్పై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.