న్యూఢిల్లీ : భారత బ్యాడ్మింటన్ డబుల్స్ జోడి సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి కెరీర్లో అత్యుత్తమ ర్యాంక్ను అందుకున్నారు. మంగళవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్లో సాత్విక్-చిరాగ్ ఒకస్థానం మెరుగై 4వ ర్యాంక్కు చేరుకున్నారు.
భారత జోడి గత యేడాది కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం, ఫ్రెంచ్ ఓపెన్ సూపర్750 టైటిల్, ఈ సీజన్లో స్విస్ ఓపెన్ సూపర్300 టైటిల్ను గెలుచుకున్నారు. గత 12 టోర్నీలలో వారు 74,651 పాయింట్లు సాధించారు. ఇటీవల మలేసియా టైటిల్గెలుచుకున్న హెచ్.ఎస్.ప్రణయ్ ఒక స్థానం మెరుగుపరచుకుని 8వ ర్యాంక్కు చేరుకున్నాడు.