Border–Gavaskar Trophy | బోర్డర్-గవాస్కర్ టోర్నీలో మూడో రోజు ఆట ప్రారంభమైంది. ఇండోర్ టెస్టులో టీమ్ఇండియా తన రెండో ఇన్నింగ్స్లో 163 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. గురువారం రెండో రోజు ఆటలో మొత్తం 16 వికెట్లు పడితే.. అందులో 12 వికెట్లు స్పిన్నర్లకే దక్కాయి. ఆసీస్ స్టార్ స్పిన్నర్ (nathan lyon)నాథన్ లియాన్(8/64) ధాటికి భారత్ 163 పరుగులకు కుప్పకూలింది. చతేశ్వర్ పుజార(59) అర్ధసెంచరీ మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు. దీంతో రోహిత్సేన ఆసీస్ ముందు 76 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది.
మూడో రోజు ఆట ప్రారంభం
బోర్డర్-గవాస్కర్ టోర్నీ మూడో టెస్టులో భాగంగా మూడో రోజు ఆట ప్రారంభమైంది. భారత్ నిర్దేశించిన 76 పరుగుల లక్ష్య ఛేదనను ఆసీస్ ప్రారంభించింది. క్రీజ్లో ట్రావిస్ హెడ్ (28), మార్నస్ (15) ఉన్నారు. అంతకుముందు రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్లో ఖవాజా (0) డకౌట్ అయ్యాడు. ప్రస్తుతం 14 ఓవర్లు ముగిసేసరికి ఆసీస్ స్కోరు 45-1