న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షడు బ్రిజ్ భూషణ్ సింగ్ ఇవాళ ఢిల్లీలోని రోజ్ అవెన్యూ కోర్టు ముందు హాజరయ్యారు. రెజ్లర్లు చేసిన లైంగిక ఆరోపణల కేసులో ఆయన కోర్టు విచారణకు వెళ్లారు. ఢిల్లీ పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేసిన కేసులో కోర్టు బ్రిజ్కు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరీ చేసింది. 24 గంటలకే ఆ బెయిల్ను ఇచ్చారు. 25వేల పూచీకత్తుపై బెయిల్ను జారీ చేశారు.
#WATCH | Former Wrestling Federation of India (WFI) chief and BJP MP Brij Bhushan Sharan Singh arrives at Rouse Avenue Court in Delhi.
Court has summoned him today in connection with the case of sexual harassment allegations by wrestlers. pic.twitter.com/C5EOyiylLa
— ANI (@ANI) July 18, 2023
గత కొన్ని నెలల క్రితం భారత మహిళా రెజర్లు .. బ్రిజ్పై లైంగిక ఆరోపణలు చేశారు. అయితే బ్రిజ్పై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో.. వాళ్లంతా ఢిల్లీలో ధర్నా చేపట్టారు. చివరకు ఢిల్లీ పోలీసులు బ్రిజ్పై ఛార్జ్షీట్ దాఖలు చేశారు.
రెజ్లర్ల ఆరోపణల కేసులో పలుమార్లు బ్రిజ్ను పోలీసులు విచారించారు. కానీ ఇంత వరకు విచారణలో ఏం తేలిందన్న అంశాల్ని మాత్రం బహిర్గతం చేయలేదు. ఒకవేళ రెజ్లర్లను వేధించినట్లు నిర్ధారణ జరిగితే, ఎంపీ బ్రిజ్ భూషణ్కు అయిదేళ్ల జైలు శిక్షపడే ఛాన్సు ఉంది.
ఎంపీ బ్రిజ్ భూషణ్కు తాత్కాలిక బెయిల్ను కోర్టు మంజూరీ చేసింది. దీంతో ఆయనకు ఈ కేసులో ఊరట లభించింది. బ్రిజ్కు వ్యతిరేకంగా తమకు ఆధారాలు దొరికినట్లు ఇటీవల ఢిల్లీ పోలీసులు చెప్పారు. మరిన్ని ఆధారాల కోసం అన్వేషిస్తున్నామని పోలీసులు తెలిపారు.
ఆరు మంది మహిళా రెజ్లర్లు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా బ్రిజ్ను పోలీసులు విచారించారు. ఐపీసీలోని సెక్షన్ 354, 354ఏ, 354డీ, 506 కింద ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఈ ఏడాది జూలై 15వ తేదీన పోలీసులు చార్జిషీట్ నమోదు చేశారు. తొలుత ఓ మైనర్ రెజ్లర్ కూడా సింగ్పై ఆరోపణలు చేసింది. కానీ ఢిల్లీ పోలీసుల సూచన మేరకు ఆ మైనర్ తన కేసును వెనక్కి తీసుకున్నది.