తాష్కెంట్ : ఆసియా ఓషియానియా గ్రూప్-1 బిల్లీ జీన్కింగ్ కప్ టోర్నీలో భారత్ 2-1తో థాయిలాండ్పై గెలుపొందింది. స్టార్ ప్లేయర్ అంకిత రాణా రెండు మ్యాచ్లు గెలుపొంది ఇండియాకు విజయాన్ని అందించింది. తొలి మ్యాచ్లో రుతుజ భోస్లే 2-6, 1-6తో లుక్సిక కుమకుమ్ చేతిలో ఓడిపోగా, రెండో సింగిల్స్లో అంకిత రైనా 5-7, 6-1, 6-3తో పీంగ్తర్న్ ప్లిపెచ్పై గెలుపొంది స్కోరు సమం చేసింది.