కాన్పూర్: సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్.. రంజీ ట్రోఫీలో అదరగొట్టాడు. భారత టెస్టు జట్టులో చోటు దక్కించుకునే ప్రయత్నాల్లో ఉన్న భువీ.. రంజీ ట్రోఫీలో ఉత్తరప్రదేశ్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. గ్రూప్-బీలోబెంగాల్తో జరుగుతున్న మ్యాచ్లో భువీ 8 వికెట్లతో విజృంభించాడు.
ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఇవే (8/41)అత్యుత్తమ గణాంకాలు కావడం విశేషం. ఫలితంగా బెంగాల్ తొలి ఇన్నింగ్స్లో 188 పరుగులకు ఆలౌటైంది. మహమ్మద్ షమీ సోదరుడు కైఫ్ (45 నాటౌట్) రాణించాడు. అంతకుముందు ఉత్తరప్రదేశ్ తొలి ఇన్నింగ్స్లో 60 పరుగులకే ఆలౌటైంది.