IPL 2024 SRH vs PBKS : భారీ ఛేదనలో పంజాబ్ కింగ్స్(Punjab Kings)కు ఆదిలోనే షాక్ తగిలింది.. హైదరాబాద్ బౌలర్లు నిప్పులు చెరుగుతుండడంతో స్వల్ప వ్యవధిలోనే మూడు వికెట్లు కోల్పోయింది. ధాటిగా ఆడుతున్న శిఖర్ ధావన్(14) భువనేశ్వర్ బౌలింగ్లో ఫ్రంట్ ఫుట్ వచ్చాడు. బంతి అందుకున్న క్లాసెన్ రెప్పపాటులో వికెట్లను గిరాటేశాడు. దాంతో, 20 పరుగులకే పంజాబ్ మూడు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం సికిందర్ రజా*(0), సామ్ కరన్(8)లు ఆడుతున్నారు. 6 ఓవర్లకు పంజాబ్ స్కోర్..27/3
అంతకుముందు కమిన్స్ ఓవర్లో జానీ బెయిర్స్టో(0) బౌల్డ్ అవ్వగా.. ఇంపాక్ట్ ప్లేయర్ ప్రభ్సిమ్రాన్ సింగ్(4)ను భువీ వెనక్కి పంపాడు. ఆ తర్వాత ధావన్ ధనాధన్ ఆడే ప్రయత్నంలో క్లాసెన్ చేతిలో స్టంపౌట్ అయ్యాడు.
.@SunRisers making early inroads! 👌 👌#PBKS three down in the chase!
Follow the Match ▶️ https://t.co/JP3mpkETgx #TATAIPL | #PBKSvSRH pic.twitter.com/9CxSihqbwv
— IndianPremierLeague (@IPL) April 9, 2024
తొలుత ఆడిన సన్రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోర్ కొట్టింది. టాపార్డర్ బ్యాటర్లంతా పెవిలియన్కు క్యూ కట్టిన చోట తెలుగు తేజం నితీశ్ కుమార్ రెడ్డి(64) సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. ఐపీఎల్లో తొలి హాఫ్ సెంచరీ బాదిన అతడు అబ్దుల్ సమద్(25)తో విలువైన భాగస్వామ్యం నెలకొల్పాడు. చివర్లో షహ్బాజ్ అహ్మద్(14) చితక్కొట్టడంతో ఆరెంజ్ ఆర్మీ 9 వికెట్ల నష్టానికి 182 రన్స్ బాదింది. ఖతర్నాక్ క్లాసెన్ సైతం ఔటైన వేళ.. భారీ స్కోర్పై ఆశలు సన్నగిల్లిన సమయంలో నితీశ్ తన మాస్టర్ క్లాస్ బ్యాటింగ్తో అలరించాడు. పంజాబ్ బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ నాలుగు వికెట్లు పడగొట్టాడు.