బెంగళూరు: ప్రొ కబడ్డీ సీజన్ (పీకేఎల్)లో బెంగళూరు బుల్స్ కెప్టెన్ పవన్ షెరావత్ బుల్లా విజృంభించాడు. ఏకంగా 27 పాయింట్లు సాధించి బెంగళూరుకు భారీ విజయాన్ని కట్టబెట్టాడు. బుధవారం జరిగిన మ్యాచ్లో ఆతిథ్య బెంగళూరు 61-22తో దబాంగ్ ఢిల్లీని చిత్తుగా ఓడించింది. సారథి పవన్ వీరవిహారం చేయగా.. భరత్ (7), చంద్రన్ (5) రాణించారు. ఢిల్లీ తరఫున అషూ మాలిక్ (6) ఫర్వాలే దనిపించాడు. మరో మ్యాచ్లో హర్యానా స్టీలర్స్- యూపీ యోధా హోరాహోరీగా తలపడగా.. చివరకు 36-36తో టైగా మారింది. హర్యానా తరఫున వికాస్ (17) విజృంభించగా.. యోధా తరఫున సురేందర్ (14) రెచ్చిపోయాడు. ఆడిన 9 మ్యాచ్ల్లో ఆరింట గెలిచి.. రెండు ఓటములు.. ఓ టైతో బెంగళూరు పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరింది.