శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్కు చెందిన పార్టీలతో ఈ నెల 24న ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం నిర్వహించనున్నారు. కేంద్ర పాలిత ప్రాంతాన్ని తిరిగి రాష్ట్రంగా మార్పు, ఎన్నికల నిర్వహణ, ఇతర ముఖ్య అంశాలపై అఖిలపక్ష సమావేశంలో చర్చించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. 2019, ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదాను రద్దు చేసి జమ్మూకాశ్మీర్, లద్దాఖ్ను కేంద్ర భూభాగాలుగా విభజించింది. ఆ తర్వాత చేపట్టిన తొలి రాజకీయ ప్రక్రియ ఇదే.
అయితే, వచ్చేవారం జరిగే సమావేశానికి సంబంధించి తమకు సమాచారం అందిందని, తాము అధికారిక ఆహ్వానం కోసం ఎదురు చూస్తున్నట్లు కాశ్మీర్కు చెందిన సీనియర్ నేత ఒకరు తెలిపారు. ఈ సమావేశానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇతర కేంద్ర నాయకులు పాల్గొననున్నారు. అలాగే నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూఖ్ అబ్దుల్లా, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ, జమ్ముకశ్మీర్ అప్నీ పార్టీ నేత అల్తాఫ్ బుఖారీ, పీపుల్స్ కాన్ఫరెన్స్ నాయకుడు సజ్జాద్ లోనెతో పాటు పలు పార్టీలకు చెందిన నేతలకు సమాచారం అందించినట్లు తెలిసింది.
కొత్త స్ట్రెయిన్ ఎఫెక్ట్ : మాస్కోలో మళ్లీ ఆంక్షలు..