బెంగళూరు: ఐపీఎల్ సీజన్ 16లో భాగంగా గురువారం రాత్రి హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్లకు మధ్య జరిగిన మ్యాచ్లో RCB విజయం సాధించింది. దాంతో ప్లే ఆఫ్కు వెళ్లే అవకాశాలను ఇంకా సజీవంగా ఉంచుకుంది. ఈ మ్యాచ్లో రెండు సెంచరీలు నమోదయ్యాయి. ముందుగా SRH తరఫున క్లాసెన్ సెంచరీ చేయగా.. తర్వాత RCB తరఫున విరాట్ కోహ్లీ కూడా సెంచరీ బాదాడు.
అయితే, SRH ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత తాను డూప్లెసిస్తో కలిసి బ్యాటింగ్ చేసేందుకు వస్తుండగా ‘ఈ రోజు నువ్వు తప్పకుండా సెంచరీ కొడుతావు’ అని డూప్లెసిస్ చెప్పినట్లు కోహ్లీ తెలిపాడు. డూప్లెసిస్ చెప్పినట్లుగా తాను సెంచరీ చేశానని అన్నాడు. డూప్లెసిస్ తాను సెంచరీ చేస్తానని చెప్పినప్పుడు ‘నువ్వు, మాక్స్వెల్ మీ ఆటను ఎక్కడికో తీసుకెళ్లారు. నేనూ మీ స్థాయికి చేరాలని కోరుకుంటున్నాను’ అని చెప్పినట్టు కోహ్లీ వెల్లడించాడు.