Jay Shah | న్యూఢిల్లీ: ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) చైర్మన్గా ముచ్చటగా మూడోసారి జై షా ఎన్నికయ్యాడు. శ్రీలంక క్రికెట్ బోర్డు అధ్యక్షుడు షమ్మి సిల్వా..షా పేరును ప్రతిపాదించగా, మిగతా సభ్యులందరూ బలపర్చారు. 2021లో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్ నజ్ముల్ హసన్ తర్వాత ఏసీసీ చైర్మన్ పగ్గాలు అందుకున్న జై షా వరుసగా మూడోసారి కుర్చీని కైవసం చేసుకున్నాడు. తనపై నమ్మకముంచి గెలిపించిన సభ్యులందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపాడు. ఆసియా అంతటా క్రికెట్ను విస్తరించేందుకు ఏసీసీ కట్టుబడి ఉందని ఈ సందర్భంగా జై పేర్కొన్నాడు.