BCCI: వన్డే వరల్డ్ కప్ ముగిసిన రెండువారాలకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) టీమిండియా కెప్టెన్, హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్లను వివరణ కోరింది. ప్రపంచకప్ ఓటమికి గల కారణాలు చెప్పాలని బీసీసీఐ పెద్దలు.. కెప్టెన్, కోచ్లతో సమావేశమైనట్టు తెలుస్తున్నది. ఢిల్లీలో ఈ సమావేశం నిర్వహించగా ద్రావిడ్ నేరుగా హాజరైన ఈ మీటింగ్కు రోహిత్ మాత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అటెండ్ అయినట్టు సమాచారం. ప్రపంచకప్లో వరుసగా పది మ్యాచ్లను గెలుచుకుని తుది మెట్టుపై బొక్క బోర్లా పడటానికి కారణం అహ్మదాబాద్ పిచ్ అని ద్రావిడ్ చెప్పినట్టు బోర్డు వర్గాల వినికిడి.
అహ్మదాబాద్ పిచ్ భారత్కు ఏమాత్రం అనుకూలించలేదని, దాని నుంచి అటు బ్యాటర్లకు గానీ ఇటు బౌలర్లకు గానీ సహకారం అందలేదని ద్రావిడ్ బోర్డు సభ్యులకు తెలిపినట్టు హిందూస్తాన్ టైమ్స్ పేర్కొంది. ఫైనల్ పిచ్కు అప్పటికే పాకిస్తాన్తో మ్యాచ్కు వాడింది. ఈ మ్యాచ్లో మాదిరిగానే టాస్ కీలక పాత్ర పోషించింది. పాక్తో పోరులో కూడా తొలుత దాయాది జట్టు బ్యాటింగ్ చేసి తడబడగా ఆ తర్వాత భారత్ లక్ష్యాన్ని ఊదిపారేసింది. ఇండియా – ఆసీస్ ఫైనల్ మ్యాచ్ లో సైతం అదే ఫలితం రిపీట్ అయింది.
Rahul Dravid said – “The Ahmedabad pitch did not turn as much as the Indian team expected in the Final of this World Cup 2023”. (To HT) pic.twitter.com/JH2ngGkZcz
— CricketMAN2 (@ImTanujSingh) December 2, 2023
ప్రపంచకప్ తర్వాత రోహిత్ లండన్లో గడుపుతుండగా ద్రావిడ్ మాత్రం ఇక్కడే ఉన్నాడు. వాస్తవానికి ఈ సమావేశం జరిగింది దక్షిణాఫ్రికా టూర్లో భారత జట్టును ఎంపిక చేయడానికి ఏర్పాటుచేసినా బోర్డు పెద్దలు మాత్రం ద్రావిడ్, రోహిత్లను వివరణ కోరారు. వరల్డ్ కప్ అయిపోవడంతో తన కాంట్రాక్టు పదవీకాలం ముగిసానా బీసీసీఐ మాత్రం.. ద్రావిడ్ కాంట్రాక్టును పొడిగించిన విషయం తెలిసిందే.