ముంబై: బీసీసీఓ ఓ కొత్త అప్డేట్ ఇచ్చింది. షార్జాలో జరిగే టీ20 వరల్డ్కప్లో టీమిండియా ఆటగాళ్లు కొత్త జెర్సీల్లో కనిపించనున్నారు. అయితే ఆ జెర్సీ ఎలా ఉంటుందో ఈ నెల 13న వెల్లడించనున్నట్లు ఇవాళ తన ట్విట్టర్లో బీసీసీఐ పేర్కొన్నది. గత ఏడాది ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్ సమయంలో నేవీ బ్లూ డ్రెస్సులో భారత క్రికెటర్లు కనిపించారు. అయితే ఈ నవంబర్లో జరగనున్న టీ20 వరల్డ్కప్లో భారత క్రికెటర్లు కొత్త జెర్సీలో దర్శనమివ్వనున్నారు. బుధవారం జరిగే జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఎంపీఎల్ స్పోర్ట్స్ నిర్వహించనున్నది. ఎంపీఎల్ స్పోర్ట్స్ భారత క్రికెట్ జట్టుకు అఫిషియల్ కిట్ స్పాన్సర్గా ఉన్నది.