ముంబై : ఆస్ట్రేలియాతో జరుగనున్న ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్కు గాయపడిన కెఎల్ రాహుల్ స్థానంలో కీపర్-బ్యాటర్ ఇషాన్ కిషన్ను ఎంపిక చేసినట్టు బీసీసీఐ సోమవారం ప్రకటించింది. లక్నో సూపర్ జెయింట్స్కు చెందిన రాహుల్ మే 1న రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ సందర్భంగా గాయపడిన సంగతి తెలిసిందే.
కాగా గాయపడిన జయదేవ్ ఉనద్కత్ స్థానంలో ఇంకా ఎవరినీ ఎంపిక చేయలేదని బీసీసీఐ తెలిపింది. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ జూన్ 7-11 తేదీలలో లండన్లోని ఓవల్ మైదానంలో జరుగనున్నది.