BCCI Central Contracts | రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, రవీంద్ర జడేజా.. సుమారు 10-15 ఏండ్లుగా భారత క్రికెట్ విజయాలలో వీళ్ల పాత్రపై సగటు భారత క్రికెట్ అభిమానిని ఎవరిని అడిగినా చెబుతారు. కానీ ఇంచుమించుగా వీళ్లంతా కెరీర్ చరమాంకంలో ఉన్నవాళ్లే. ఈ దిగ్గజ క్రికెటర్లంతా మహా అయితే మరో రెండు మూడేండ్ల కంటే ఎక్కువ ఆడతారనుకోవడమూ అత్యాశే.. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కుర్ర క్రికెటర్లకు పెద్దపీట వేసింది. మునుపెన్నడూ లేనివిధంగా బీసీసీఐ తాజాగా విడుదల చేసిన సెంట్రల్ కాంట్రాక్టులలో ఏకంగా పది మంది యువ క్రికెటర్లకు చోటిచ్చింది. వీరిలో అత్యధికులు గతేడాది భారత జట్టుకు అరంగేట్రం చేసినవాళ్లే కావడం గమనార్హం. యశస్వీ జైస్వాల్, రింకూ సింగ్, తిలక్ వర్మ, జితేశ్ శర్మ, ముఖేష్ కుమార్, అవేశ్ ఖాన్, రవి బిష్ణోయ్, రవి బిష్ణోయ్లు కాంట్రాక్టులు దక్కించుకున్నారు.
సీనియర్లు కెరీర్ చివరిదశలో ఉన్న నేపథ్యంలో యువ క్రికెటర్లకు బీసీసీఐ పెద్దపీట వేసింది. గతేడాది వెస్టిండీస్ టూర్లో అరంగేట్రం చేసి ప్రస్తుతం ఇంగ్లండ్తో టెస్టు సిరీస్లో ఏకంగా రెండు డబుల్ సెంచరీలు చేసిన యశస్వీ జైస్వాల్కు నేరుగా గ్రేడ్ ‘బీ’ కాంట్రాక్టు ఇచ్చింది. రింకూ, తిలక్, దూబే, జితేశ్, ముఖేష్, ప్రసిధ్, అవేశ్, రజత్, బిష్ణోయ్లు గ్రేడ్ ‘సీ’ కాంట్రాక్టు పొందారు. సీ గ్రేడ్లో ఉన్న క్రికెటర్లలో సంజూ శాంసన్, అర్ష్దీప్ సింగ్, కెఎస్ భరత్లు మాత్రమే గతేడాది లిస్ట్లో ఉన్నారు.
Additionally, athletes who meet the criteria of playing a minimum of 3 Tests or 8 ODIs or 10 T20Is within the specified period will automatically be included in Grade C on a pro-rata basis.
For more details, click the link below 👇👇https://t.co/IzRjzUUdel #TeamIndia
— BCCI (@BCCI) February 28, 2024
వాళ్లకూ అవకాశం…
గ్రేడ్ ‘సీ’లో ఉన్న క్రికెటర్లతో పాటు ఇంగ్లండ్తో టెస్టు సిరీస్లో ఎంట్రీ ఇచ్చిన సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్లకూ బీసీసీఐ బంపరాఫర్ ఇచ్చింది. ఈ ఇద్దరూ ఒకవేళ ధర్మశాల వేదికగా జరుగుతున్న టెస్టులో కూడా ఆడితే వాళ్లు కూడా ఆటోమేటిక్గా సెంట్రల్ కాంట్రాక్టు పొందుతారని తెలిపింది. ఈ మేరకు వెల్లడించిన ప్రకటనలో… ‘ఒక క్రికెటర్ ఒక సీజన్లో మూడు టెస్టులు లేదా 8 వన్డేలు లేదా 10 టీ20లు ఆడితే ఆ క్రికెటర్ నేరుగా గ్రేడ్ సీ కాంట్రాక్టు దక్కించుకుంటాడు. ఉదాహరణకు ఇప్పుడు జురెల్, సర్ఫరాజ్లు ఇంగ్లండ్తో సిరీస్లో ఇదివరకే రెండు టెస్టు (రాజ్కోట్, రాంచీ)లు ఆడారు. వాళ్లు ధర్మశాల టెస్టు కూడా ఆడితే ఆటోమేటిక్గా కాంట్రాక్టు పొందుతారు..’ అని తెలిపింది. దీని ప్రకారం.. రజత్ పాటిదార్కు బీసీసీఐ సీ గ్రేడ్ కాంట్రాక్టు ఇచ్చింది కూడా ఈ విధానంలోనే అని చెప్పొచ్చు. పాటిదార్.. వైజాగ్, రాజ్కోట్, రాంచీలలో ఆడాడు.
యువ ఫాస్ట్ బౌలర్లకూ కాంట్రాక్టులు..
The Selection Committee has also recommended Fast Bowling contracts for the following athletes – Akash Deep, Vijaykumar Vyshak, Umran Malik, Yash Dayal and Vidwath Kaverappa.#TeamIndia
— BCCI (@BCCI) February 28, 2024
ఇంగ్లండ్తో నాలుగో టెస్టులో ఎంట్రీ ఇచ్చిన బెంగాల్ పేసర్ ఆకాశ్ దీప్తో పాటు ఐపీఎల్లో సన్ రైజర్స్ తరఫున ఆడే జమ్మూ ఎక్స్ప్రెస్ ఉమ్రాన్ మాలిక్, విజయ్కుమార్ వైశాక్, యశ్ దయాల్, విద్వత్ కావేరప్పలకు బీసీసీఐ తీపికబురు అందించింది. పైన పేర్కొన్న క్రికెటర్లకు ఫాస్ట్ బౌలింగ్ కాంట్రాక్టులను అందించాలని సెలక్షన్ కమిటీ రికమండ్ చేసింది.