ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్లో భారత క్రికెట్ అభిమానులను తీవ్రంగా బాధపెడుతున్న అంశం కోహ్లీ, రోహిత్ శర్మల ఫామ్. రోహిత్కు పలు మ్యాచుల్లో శుభారంభాలు దక్కినా వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోయాడు. ఇక కోహ్లీకి అవి కూడా లేవు. రెండు సార్లు వరుసగా గోల్డెన్ డక్గా పెవిలియన్ చేరాడీ స్టార్ బ్యాటర్.
ఆ తర్వాత ఓపెనర్ అవతారం ఎత్తినా ప్రయోజనం లేకపోయింది. ఈ క్రమంలో వీళ్లిద్దరి ఫామ్పై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘వాళ్లిద్దరూ అద్భుతమైన ఆటగాళ్లు. తప్పకుండా మళ్లీ ఫామ్లోకి వస్తారు. కోహ్లీ విషయంలో పొరబాటు ఎక్కడ జరుగుతుందో నాకుత తెలియదు. అసలు కోహ్లీ మనసులో ఏముందో కూడా అర్థం కావడం లేదు. కానీ అతను మళ్లీ ఫామ్లోకి వచ్చి మంచి స్కోర్లు చేస్తాడని బలంగా నమ్ముతున్నాను. అతను గొప్ప ఆటగాడు’’ అని మెచ్చుకున్నాడు.
అలాగే ప్రస్తుత ఐపీఎల్ సీజన్ అద్భుతంగా సాగుతోందని చెప్పిన గంగూలీ.. సన్రైజర్స్ హైదరాబాద్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడని కొనియాడాడు. ఉమేష్ యాదవ్, ఖలీల్ అహ్మద్ కూడా సూపర్గా ఆడుతున్నారని, కొత్త జట్లు రెండూ సత్తా చాటుతున్నాయని చెప్పుకొచ్చాడు.