ముంబై: టీమిండియా ప్రధాన కోచ్ పదవి కోసం ఆస్ట్రేలియా మాజీ ఆటగాళ్లు జస్టిన్ లాంగర్, రికీ పాంటింగ్ను బీసీసీఐ సంప్రదించిందని వస్తున్న వార్తలన్నీ పుకార్లేనని బోర్డు కార్యదర్శి జైషా స్పష్టం చేశాడు. శుక్రవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో జై షా స్పందిస్తూ.. ‘భారత క్రికెట్ జట్టు హెడ్కోచ్ పదవి కోసం నేను గానీ, బీసీసీఐ గానీ ఏ ఒక్క ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ను సంప్రదించలేదు.
మీడియాలో వస్తున్న వార్తలన్నీ నిరాధారం. టీమిండియాకు హెడ్కోచ్ను ఎంపిక చేయడం సమగ్రమైన ప్రక్రియ. భారత క్రికెట్ గురించి లోతైన అవగాహన ఉన్న కోచ్పై మేము దృష్టిసారించాం’ అని పేర్కొన్నాడు.