BCCI : బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ చివరి రెండు టెస్టులు, ఆ తర్వాత జరగనున్న వన్డే సిరీస్కు భారత జట్టును బీసీసీఐ ఈరోజు ప్రకటించింది. రంజీ ట్రోఫీ ఫైనల్ ఆడేందుకు స్క్వాడ్ నుంచి తప్పుకున్న పేసర్ జయదేవ్ ఉనాద్కాట్ రెండు టెస్టులకు ఎంపికయ్యాడు. అంతేకాదు అతడిని వన్డే జట్టుకు కూడా బీసీసీఐ సెలక్ట్ చేయడం విశేషం. రెండు టెస్టుల్లోనూ విఫలమైన కేఎల్ రాహుల్ కూడా స్వ్కాడ్లో ఉన్నాడు. భారత్, ఆస్ట్రేలియా మధ్య ఇండోర్ వేదికగా మార్చి 1న మూడో టెస్టు ప్రారంభం కానుంది. నాలుగో టెస్టు మార్చి 9-13న అహ్మదాబాద్లో జరగనుంది.
టెస్టు జట్టుః రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్, ఛటేశ్వర్ పూజారా, విరాట్ కోహ్లీ, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, జయదేవ్ ఉనాద్కాట్.
వన్డే జట్టుః రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యార్, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్ధిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, యజువేంద్ర చాహల్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, జయదేవ్ ఉనాద్కాట్.
భారత్, ఆస్ట్రేలియా మూడు వన్డేల సిరీస్ ఆడనున్నాయి. మొదటి వన్డే మార్చి 17న ముంబైలో ప్రారంభం కానుంది. మార్చి 19న విశాఖపట్నం వేదికగా రెండో వన్డే జరగనుంది. ఇరుజట్లు మార్చి 22న చెన్నైలో మూడో వన్డేలో తలపడతాయి. అయితే.. కెప్టెన్ రోహిత్ శర్మ ఫ్యామిలీ కమిట్మెంట్స్ కారణంగా మొదటి వన్డేకు దూరం కానున్నట్టు సమాచారం. దాంతో, అతని ప్లేస్లో హార్ధిక్ పాండ్యా జట్టును నడిపించనున్నాడు.
బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ రెండో టెస్టులో భారత్ 6 వికెట్ల తేడాతో ఆసీస్పై గెలుపొందింది. 115 లక్ష్య ఛేదనలో పూజారా 31, కేఎస్ భరత్ 23తో అజేయంగా నిలిచి జట్టును విజయ తీరాలకు చేర్చారు. పది వికెట్ల ప్రదర్శన చేసిన రవీంద్ర జడేజాకుకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. నాగ్పూర్ టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో విజయం సాధించింది. దాంతో, ఇండియా నాలుగు టెస్టుల సిరీస్లో 2-0 ఆధిక్యంలో ఉంది.
🚨 NEWS 🚨: India squads for last two Tests of Border-Gavaskar Trophy and ODI series announced. #TeamIndia | #INDvAUS | @mastercardindia
More Details 🔽https://t.co/Mh8XMabWei
— BCCI (@BCCI) February 19, 2023