ఆసియా కప్ జరిగిన తర్వాత భారత జట్టు.. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలతో స్వదేశంలో సిరీస్లు ఆడనుంది. ఈ విషయాన్ని బీసీసీఐ ఇదివరకే ప్రకటించింది. తాజాగా ఈ సిరీస్ల షెడ్యూల్ను బీసీసీఐ వెల్లడించింది. భారత జట్టు మొదటగా ఆసీస్తో టీ20 సిరీస్ ఆడుతుంది. తొలి మ్యాచ్ మొహాలీ వేదికగా జరుగుతుంది.
రెండో టీ20 నాగ్పూర్లో, మూడో టీ20 హైదరాబాద్లో జరగనున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. అలాగే సౌతాఫ్రికా సిరీస్ షెడ్యూల్ను కూడా ప్రకటించింది. సఫారీలతో మూడు టీ20లు ఆడుతుండగా.. అవి వరుసగా తిరువనంతపురం, గువాహతి, ఇండోర్ వేదికలుగా జరగనున్నాయి.
ఆ తర్వాత మూడు వన్డేలు వరుసగా లక్నో, రాంచీ, ఢిల్లీలో జరుగుతాయి. కాగా, సౌతాఫ్రికాతో భారత్ ఆడే రెండో టీ20 మ్యాచ్ అక్టోబర్ 2న జరుగుతుంది. ఆ రోజు గాంధీ జయంతిని పురస్కరించుకొని, మహాత్ముడు పుట్టిన గువాహతిలోనే ఈ మ్యాచ్ నిర్వహిస్తున్నట్లు బీసీసీఐ తెలిపింది.
Take a look at #TeamIndia's home series fixture against Australia. 👍#INDvAUS pic.twitter.com/zwNuDtF32R
— BCCI (@BCCI) August 3, 2022
Check out the #INDvSA home series schedule. 👌#TeamIndia | @BCCI | @OfficialCSA pic.twitter.com/jo8zC4hjDq
— BCCI (@BCCI) August 3, 2022