భారత జట్టు వన్డే సారధిగా విరాట్ కోహ్లీ స్థానంలో రోహిత్ శర్మ ఎంపికయ్యాడు. ఇక నుంచి జరిగే అన్ని సిరీసుల్లోనూ వన్డే, టీ20 జట్లకు రోహితే సారధ్యం వహిస్తాడని భారత క్రికెట్ సమాఖ్య (బీసీసీఐ) ప్రకటించింది. ఈ ప్రకటనతో సౌతాఫ్రికా సిరీస్లో జరిగే మూడు వన్డే మ్యాచుల్లో భారత జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు.
ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్ తర్వాత భారత టీ20 జట్టు సారధ్యానికి విరాట్ కోహ్లీ వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే న్యూజిల్యాండ్తో జరిగిన టీ20 సిరీస్లో భారతజట్టుకు రోహిత్ శర్మ సారధ్యం వహించాడు. ఇప్పుడు వన్డే జట్టుకు కూడా రోహిత్ శర్మనే సారధిగా నియమిస్తూ బీసీసీఐ సెలెక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది.