ముంబై: ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్(World Test Championship Final)లో భాగంగా ఆస్ట్రేలియాతో జరగనున్న ఫైనల్ మ్యాచ్ కోసం బీసీసీఐ ఇండియన్ జట్టును ప్రకటించింది. భారత టెస్టు జట్టులో అజింక్య రహానేకు స్థానం కల్పించారు. లండన్లోని ఓవల్ మైదానంలో జూన్ 7వ తేదీ నుంచి డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనున్న విషయం తెలిసిందే. రహానేతో పాటు మరికొంత ప్లేయర్లు కూడా సర్ప్రైజ్గా జట్టులో చేరారు. ఆ జాబితాలో కేఎస్ భరత్, జయదేవ్ ఉనద్కత్ ఉన్నారు.
🚨 NEWS 🚨#TeamIndia squad for ICC World Test Championship 2023 Final announced.
Details 🔽 #WTC23 https://t.co/sz7F5ByfiU pic.twitter.com/KIcH530rOL
— BCCI (@BCCI) April 25, 2023
అజింక్య రహానే ఇటీవల ఐపీఎల్లో టాప్ ఫామ్ను ప్రదర్శిస్తున్నాడు. చెన్నై జట్టుకు ఆడుతున్న అతను స్ట్రయిక్ రేటుతో అదరగొడుతున్నాడు. అయిదు మ్యాచుల్లో అతను 199 స్ట్రయిక్ రేటుతో 209 రన్స్ చేశాడు. టెస్టు చాంపియన్షిప్ ఫైనల్కు రోహిత్ శర్మ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఆల్ ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ .. ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్కు భారత జట్టును ఎంపిక చేసింది.
15 మంది టెస్టు స్క్వాడ్లో రోహిత్ శర్మ, శుభమన్ గిల్, చతేశ్వర్ పూజారా, విరాట్ కోహ్లీ, అజింక్య రహానే, కేఎల్ రాహుల్, కేఎస్ భరత్, రవిచంద్ర అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, షమీ, సిరాజ్, ఉమేశ్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్ ఉన్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్ జూన్ ఏడు నుంచి 11 వరకు జరగనున్నది. 12వ తేదీన రిజర్వ్ డేగా ఉంచారు.