న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక నేషనల్ బాస్కెట్బాల్ అకాడమీ(ఎన్బీఏ)కి ఎంపికైన తొలి భారతీయునిగా పేరొందిన సత్నామ్సింగ్ భామ్రా..రెజ్లింగ్లోకి అడుగుపెట్టాడు. అమెరికాకు చెందిన ప్రొఫెషనల్ రెజ్లింగ్ లీగ్లో బరిలోకి దిగుతున్నాడు. ఆల్ ఎలైట్ రెజ్లింగ్(ఏఈడబ్ల్యూ)లో పోటీపడేందుకు ప్రొ రెజ్లర్గా సత్నామ్ త్వరలో శిక్షణ తీసుకోబోతున్నాడు. ఎన్బీఏ ప్లేయర్లు రెజ్లింగ్ లీగ్లో పోటీపడటం ఇది కొత్తేం కాదు. ఎన్బీఏ దిగ్గజం షాక్వైల్ ఓ నీల్, జేడ్ కార్గిల్ ఇప్పటికే ఏఈడబ్ల్యూలో సత్తాచాటుతున్నారు. సత్నామ్సింగ్ లాంటి ప్లేయర్లతో ఒప్పందం కుదుర్చుకోవడం సంతోషంగా ఉందని ఏఈడబ్ల్యూ సీఈవో టోనీ ఖాన్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే 2015లో ఎన్బీఏలో డల్లాస్ మావెరిక్స్ జట్టుకు ఎంపికైన 25 ఏండ్ల సత్నామ్సింగ్..డోపింగ్కు పాల్పడటంతో జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ(నాడా)రెండేండ్ల పాటు నిషేధం విధించింది. ఈ ఏడాది నవంబర్ 19తో ఈ నిషేధం ముగుస్తుంది.