బొడ్రాయిబజార్: సూర్యాపేట జిల్లా కేంద్రంలో 4వ రాష్ట్ర స్థాయి అంతర్జిల్లాల బాస్కెట్బాల్ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. పోటీల రెండో రోజైన శుక్రవారం ఆయా జిల్లాల జట్లు బరిలోకి దిగాయి. బాలికల విభాగంలో సూర్యాపేటపై ములుగు, నిర్మల్పై హైదరాబాద్, రంగారెడ్డిపై మహబూబ్నగర్, హనుమకొండపై జగిత్యాల జట్లు గెలిచాయి. సూర్యాపేటపై వికారాబాద్, జగిత్యాలపై ఖమ్మం జట్లు గెలిచి ప్రిక్వార్టర్స్లోకి ప్రవేశించాయి.
బాలుర విభాగంలో మహబూబాబాద్పై రంగారెడ్డి, ఖమ్మంపై నిర్మల్, నిజామాబాద్పై ములుగు, హనుమకొండపై జగిత్యాల విజయాలు సాధించాయి. సూర్యాపేటపై నిర్మల్, మహబూబాబాద్పై వికారాబాద్, మహబూబ్నగర్పై జగిత్యాల గెలిచి ప్రిక్వార్టర్స్ పోరుకు అర్హత సాధించాయి. రెండో రోజు పోటీలకు రాష్ట్ర బాస్కెట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి నార్మన్ ఇసాక్ పాల్గొన్నారు.