Bank Employee Suicide : ముంబైలో 28 ఏండ్ల యువకుడు అనూమానాస్పద రీతిలో ఆత్మహత్య(Suicide) చేసుకున్నాడు. మృతుడిని సెంట్రల్ ముంబైలోని పరేల్ నివాసి ఆకాశ్ సింగ్(Akash Singh)గా గుర్తించారు. అసలేం జరిగిందంటే..? ముంబైలోని ఒక ప్రైవేట్ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న ఆకాశ్ శుక్రవారం (నవంబర్ 10) రాత్రి బాంద్రా – కుర్లా నుంచి పరేల్ వెళ్లేందుకు ఓ ట్యాక్సీ ఎక్కాడు. కాసేపటికే ట్యాక్సీని సముద్ర వంతెన మార్గం గుండా పోనిమ్మని డ్రైవర్కు చెప్పాడు.
వంతెన మీద నుంచి వెళ్తున్న సమయంలో ఫోన్లో మాట్లాడుతున్న ఆకాశ్.. అకస్మాత్తుగా తన ఫోన్ కింద పడిపోయిందని డ్రైవర్కు చెప్పి ట్యాక్సీని పక్కకు ఆపమన్నాడు. డ్రైవర్ పక్కకు ఆపిన వెంటనే వంతెన మీద నుంచి నీళ్లలోకి దూకాడున. ఊహించని పరిణామంతో షాక్ తిన్న సదరు డ్రైవర్ వెంటనే పోలీసులకు సమాచారమిచ్చాడు. అదే రోజు రాత్రి ఆకాశ్ మృతదేహం ఒడ్డుకు కొట్టుకొచ్చిందని పోలీసులు తెలిపారు. అతడి మృతికి కారణాల్ని ఆరా తీయగా మూడు నెలల క్రితం ప్రేయసితో బ్రేకప్ అయిందని తెలిసింది. అయితే.. ఆకాశ్ సూసైడ్కు ప్రేమ వ్యమహారమే కారణమా? మరే ఇతర కారణం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.