ఢాకా: ప్రపంచ చాంపియన్ ఇంగ్లండ్పై బంగ్లాదేశ్ సిరీస్ విజయం సాధించింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆదివారం జరిగిన రెండో టీ20లో బంగ్లా 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. సొంతగడ్డపై అద్భుత ప్రదర్శనతో ఇప్పటికే తొలి మ్యాచ్ నెగ్గిన బంగ్లా.. తాజా విజయంతో 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 117 పరుగులకు ఆలౌటైంది.
డకెట్ (28) టాప్ స్కోరర్ కాగా.. బట్లర్ (4), మలాన్ (5) విఫలమయ్యారు. బంగ్లా బౌలర్లలో మెహదీ హసన్ మిరాజ్ 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో బంగ్లా 18.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 120 రన్స్ చేసింది. నజ్ముల్ హుసేన్ శాంటో (46 నాటౌట్) చివరి వరకు క్రీజులో నిలిచి జట్టును గెలిపించాడు. ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ 3 వికెట్లు పడగొట్టినా ఫలితం లేకపోయింది. మెహదీ హసన్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇంగ్లండ్పై బంగ్లాదేశ్కు ఇదే తొలి ద్వైపాక్షిక సిరీస్ విజయం కావడం విశేషం.